Friday, June 21, 2013








మన పురాణాలు ,ఇతిహాసాలు ,మహాత్ముల జీవితాలు అధ్యయనమే అన్ని నైతిక విలువలను నేర్పుతుందని ఆమంచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాథశాల తెలుగు ఉపాధ్యాయురాలు ,కవయిత్రి పెరుగు సుజనారామం తెల్పారు. స్థానిక దర్గామిట్ట లోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలోగురు వారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిధి గా హాజారైన ఆమె బాలికలకు స్ఫూర్తి నిచ్చే పలు అంశాలు ప్రస్థావించారు. ముఖ్యంగా బాలికా విద్య ప్రారంభించిన సావిత్రి భాయి ఫులే ను పిల్లలకు గుర్తు చెసారు. ఖాళీ సమయంలో తాను తరచు ఇక్కడ పదవ తరగతి బాలికలకు తెలుగు మరియు ఇతరులకు అందరికీ నైతిక విలువలు తెల్పే మంచి కథలు చెపుతానని వాగ్దానం చెసారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ ఇటీవల తాను రాసిన పిల్లల నవలిక హృదయ బంధం పిల్లలకు పరిచయం చేసి పొరుగు వారి పట్ల ,పొరుగు దేశాల పట్ల స్నేహ భావం కలిగి వుండాలన్నారు .. వసతి గృహ వార్డెన్ బేబీ విద్య సంవచరం ప్రారంభంలోనే పిల్లలకు ఇలాంటి మంచి విషయాలు చెప్పినందుకు ధన్య వాదాలు తెల్పరు. సహృదయ సంస్థ అధ్యక్షలు సనత్ కుమార్,కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రసంగించారు అనంతరం బాలికలు జానపద గీతాలు ఆలపించారు.


Tuesday, June 18, 2013

నెల నెలా వెన్నెల వార్త -16-06-2013

తెలుగు నాటకరంగంలో నేల్లూరీయులైన వేదం వెంట్రాయ శాస్త్రి నాటక రచనలో పాత్రోచిత సంభాషణలు
ప్రవేశ పెట్టిన ఆద్యులు అని ,ఆయన గ్రాంధిక భాషావాది అయినప్పటికీ నాటకంలో పాత్రల నేపథ్యానికి
అనుగుణంగా భాష ఉండటం వల్ల ప్రతాపరుద్రీయం నాటకం విశేష ప్రజాదరణ పొందిందని ప్రముఖ నాటకరంగ విశ్లేషకులు సాహితీ వేత్త డాక్టర్ కడియాల రామోహనరాయ్ పెర్కొన్నరు. స్థానిక ప్రభుత్వ సంగీత కళాశాల లో జరిగిన నెల నెలా వెన్నెల పదిహేడవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. 

నూట యాభై ఏళ్ళ తెలుగు నాటక రంగం పై మొదటి వందేళ్ళ గురించి సూక్ష్మంగా, తరువాతి యాభై ఏళ్ళ గురించి విపులంగా ప్రస్థావించారు. తెలుగు నాటక రంగంకు నూతన దశ దిశా నిర్దేశించటంలో ఇద్దరు ప్రముఖులు రాజమన్నార్ ,బళ్ళారి రాఘవ ల పాత్ర ప్రముఖమయినది అన్నారు. కందుకూరి వీరేశలింగం రాసిన తొలి వీధి నాటకంతో మొదలై ఇప్పటికి సుమారు పదివేలకు పైగా నాటకాలు, నాటికలు వచ్చాయన్నారు నేల్లూరీయులైన ఆత్రేయ రాసిన యన్ జి ఓ నాటకం వైవిధ్య భరితం అన్నారు. ప్రస్తుతం గత యాభై ఏళ్ళ తెలుగు నాటక వికాసం -సమాజం పై ప్రభావం అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వ యుజిసి సంస్థకు చేస్తున్న సమగ్ర పరిశోధనకు ఆయన భాద్యత వహిస్తున్నట్లు తెల్పారు. అంతకు ముందు సభాధ్యక్షులు అల్లు భాస్కర్ రెడ్డి గారు నాటకం జన బాహుళ్యం లోకి సందేశాలను తీసుకెళ్ళే శక్తి వంతమయిన ప్రక్రియ అన్నారు, తెలుగు నాటక రంగానికి సురభి కళాకారుల సేవలు శ్లాగనీయమయినవి అన్నరు. రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు డాక్టర్ మోహన్ రాజు ప్రసంగిస్తూ ఆధ్యాత్మిక వాంగ్ మయాన్ని ప్రచారం చేయాలో తెలుగు నాటకం కీలక పాత్ర వహిందని గుర్తు చెసారు. అంతకు ముందు ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ ముఖ్య అతిధిని సభకు సమగ్రంగా పరిచయం చెసారు. అనంతరం డాక్టర్ కడియాల రామ్ మోహన్ రాయ్ దంపతులను ప్రభాకర్ రెడ్డి దంపతులు ఘనగా సథ్కరించారు. డాక్టర్ కరిమద్దిల నరసింహా రెడ్డి,బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి, కవయిత్రులు అనురాధా రామకృష్ణ ,పెరుగు సుజనారామం, శిరీష ,జగదీశ్ ,రవి, కృష్ణ మరియు సాయిసదన్ సత్సంగ సభ్యులు పాల్గొన్నరు.