Thursday, December 31, 2009

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెల్లూరు రొట్టెల పండుగ



Darga - famous for Rottela Panduga (Bread festival of Nellore)

నెల్లూరు నగరం లోని "బారా షహీద్ దర్గా" మొహరం పండుగ వస్తే చాలు దేశ,విదేశాలనుండి భక్తులని ఆకర్షిస్తూ రొట్టెలు పంచుకొని, మొక్కులు చెల్లించుకొనే "ఒకే ఒక విశేషపండుగ" జరుపుకొనే ఏకైక ప్రదేశం గానమోదయి చరిత్రలో నిలచిపోయింది. భారతదేశ సంస్కృతి, సమైక్యత,మతసామరస్యానికి,ప్రతీకగా రొట్టెల పండుగనిలుస్తుంది.ప్రతి సంవత్సరం దర్గా దర్శించి మొక్కులు చెల్లించే వారిలో ముస్లిములతో పాటు,ఇతర మతాల వారుముఖ్యంగా స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. రొట్టెల పండుగ సుమారు ఎనభై సంవత్సరాలుగా ఇక్కడజరుగుతున్నట్టు ఆధారా లు వున్నాయి. 1905 లో దర్గా ప్రస్తావన నెల్లూరు శాసనాలు రెండవ సంపుటం లోకనిపిస్తుంది.

బారా షహీద్ దర్గా కు సంబంధించి ఒక కధ వుంది. యుద్దంలో పన్నెండు మంది వీరులు నెల్లూరు కు దగ్గరలో గలగండవరం వద్ద అమరులయ్యారు.తలలు లేని వీరుల దేహాలు గుర్రాలపై స్వారి చేస్తూ ఇప్పుడు సమాదులున్న చోటపడిపోయాయి.భక్తులు ప్రదేశం లోనే వారికి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. ఆర్కాటునవాబు ఒక సారి దారిన వెళ్తూ దర్గా వద్ద ఏదో మొక్కు మొక్కుకున్నారట. ఆయన కోరిక నెరవేరడం తో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ,చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కధనం. సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికల లో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది.

మత సామరస్యానికి ప్రతీకగా ఎంతో వైభవంగా, అశేష భక్త జన సందోహం మధ్య జరిగే రొట్టెల పండుగ ఏడాది 28 డిసెంబర్మొదలై 29 గంధ మహోత్సవం,30 రొట్టెల మార్పిడి,31 జియారత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ రొట్టెల పండుగ లో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు,అనుమసముద్రం పేటల లోనిపేరొందిన దర్గాల ను కూడా సందర్శిస్తారు.

పవిత్రంగా, పరిశుభ్రంగా ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు(రొట్టెలు)చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.ఆరోగ్యం గురించి మొక్కు కొంటె ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె ,సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె,..సంప్రదాయ రొట్టెలుతో మొదలైన పండుగలో ఇప్పుడు వీసా రొట్టెలు, ప్రజా ప్రతినిధులు వదిలే అభివృద్ధి రొట్టెలు అదనపుఆకర్షణలవుతున్నాయి. ఏడాది ప్రత్యేకించి రొట్టెల పండుగ జనవరి లో జరిగి మళ్ళీ రెండవసారి డిసెంబర్ లో వచ్చింది.



బారా షహీద్ అమరవీరుల సమాధుల ద్వారం

లక్ష్యల సంఖ్య లో ప్రజలు దేశం లోని వివిధ ప్రదేశాల నుంచిమరియు గల్ఫ్ లాంటి విదేశాల నుంచి వచ్చి మొక్కులుచెల్లించడం
పెరిగి పోతున్నందున జిల్లా యంత్రాంగం ఇప్పుడు ప్రత్యేక దృష్టిపెట్టి రవాణ సౌకర్యం,అన్నదానాలు, మంచినీరు,మరుగుదొడ్లు,
లాంటి వసతులన్నీ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుంది. ఇదిఎంతయినా అభినందనీయం..! దర్గా మైదానంలో ఎక్కడ చెత్తలేకుండా చూసే భాద్యతను నెల్లూరు నగర పాలక సంస్థచేపట్టింది. కార్యక్రమంలో నగర ఎమెల్యే ఎం.శ్రీధరకృష్ణా రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమెల్యే ఆనం.వివేకానంద రెడ్డి జిల్లా కలెక్టర్రాంగోపాల్,ఎస్పీ మల్లారెడ్డి , మేయర్ భానుశ్రీ తదితరులునిమగ్నమై వున్నారు..!

పండుగ గురించి తెలియని వారు వచ్చే సంవత్సరం మొహరం రోజుకి నెల్లూరు వచ్చేయండి..!
రొట్టెల పండుగలో పాల్గొనండి..!!

Tuesday, December 8, 2009

మిడ్నాపూర్ జాతీయ కవితోత్సవం-2009

ప్రముఖ బెంగాలి దిన పత్రిక "ఉపత్యక" ఆహ్వానం మేరకు పశ్చిమ బెంగాల్ లో గల
మిడ్నాపూర్ లో ప్రతి ఏట నిర్వహించే కవితోత్సవం కి నెల్లూరు జిల్లా నుండి నేను ప్రతిమ
ఎంపిక కాబడాము.నేను నెల్లూరు నుండి 05-12-2009 ఉదయం యశ్వంతపూర్ -హౌరా
సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాను.సరిగ్గా 23 గంటలు ప్రయాణం తర్వాత ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో దిగాను .
ప్రముఖ బెంగాలికవి విప్లవ్మాజి నన్ను రిసీవ్ చేసుకునేందుకు స్టేషనుకు వచ్చారు .
ఖరగ్పూర్ నుండి తొమ్మిది కిలో మీటర్ల దూరంలో గల మిడ్నాపూర్ బయలుదేరాము .
ఉదయపు చలిగాలిలో కారులో ప్రయాణిస్తూ కంసావతి నది దాటాక తెల తెల వారుతుండగా
కలకత్తా నగరం కన్నా అతి పురాతనమైన ,చారిత్రాత్మకమైన ఆ పట్టణంలో ప్రవేశించగానే
ఏదో చెప్పలేని పులకింత. భారత స్వాతంత్ర్య ఉద్యమం పురుడు పోసుకుంది ..
ఆ పట్టణంలోనే అని విప్లవ్మాజి చెప్పినపుడు ఒక గగుర్పాటు.. నేరుగా విప్లవ్మాజి వారింటికెళ్లి
ఫ్రెషప్ అయ్యాక వారి శ్రీమతి నందిత భట్టాచార్య అందించిన బ్రెడ్ టోస్ట్ ,వేడి టీ సేవించాను ..
ఇంతలో హర్యానా నుంచి ఆహ్వానితులైన కవి దంపతులు సుశీల్,ఊర్మిళా కౌశిక్ లు అక్కడకి చేరుకున్నారు .ప్రయాణం గురించి కబుర్లయ్యాక మాకు నిర్దేశించిన హోటల్ రిట్జ్ బెంగాల్ లో దిగబెట్టారు.బెంగాలి చిన్న దిన పత్రిక 'ఉపత్యక" ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆశ్చర్యం కలిగించింది.15 ఏండ్లుగా ఆ పత్రిక వస్తున్నట్లు చెప్పారు..


విద్యా సాగర్ స్మృతి మందిర్ - ఈ మందిరం 1939లో రవీంద్రనాథ్ ఠాగోర్ చే ఆవిష్కరింపబడ్డది.

1939 లో విశ్వ కవి రవీంద్రనాథ్ స్వయంగా ప్రారంభించిన "విద్యాసాగర్ స్మృతి మందిర్ " ఈ కవితోత్సవ వేదిక అనివిప్లవ జీ చెప్పినప్పుడు మళ్లీ ఒళ్లు పులకించింది.. సరిగ్గా 10.00 గంటలకు కార్యక్రమం మొదలయింది.అతిధులను ఆహ్వానించారు.నేను రెండవ ఉపన్యాసకుడిగా " మా మహాకవి శ్రీశ్రీ " అనే పరిచయ పత్ర సమర్పణచేశాను..అనంతరం శబ్ద కాలుష్యం గురించి ఒక కవిత తెలుగులో మరియూ అంగ్ల అనువాద కవితవినిపించాను..ప్రముఖ బెంగాలి కవి ఆశిష్ సన్యాల్ (79) శ్రీశ్రీ తో ఆయనకు పరిచయమున్నట్లు చెప్పిఆ జ్ఞాపకాలు నెమరేసుకున్నారు..ఈ సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక మా పరిచయాలు ,కవిత వేసి వెలువరించారు..ఆ వేదిక మీద నుండి ఆ రోజు 10 బెంగాలి పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి..ముఖ్యంగా ఆ జిల్లా గ్రామీణ కథల 4 వ సంపుటి నన్ను ఎంతో ఆకర్షించింది..యువ కవులు కవిత్వం 300 కాపీలు ప్రచురిస్తున్నట్టు చెప్పారు.ముద్రణ ఎంతో బాగుంది.



ఎడమ నుండు కుడి వైపు: హర్యానా కవి సుషీల్ కౌసిక్, బెంగాల్ కవి ఆషిష్ సన్యాల్, బెంగాలి కవి విప్లవ్ మాజీ, రామకృష్ణ, ఉపథ్యక సంపాదకుడు తపోష్ మైతీ ఇంకా శ్రీమతి తపోష్ మైతీ

ఆ సాయంత్రం నాలుగు గంటల వరకు కవిసమ్మేళనం జరిగింది...మాకు జ్ఞాపికలుగా
అక్కడ గ్రామీణ మట్టి తో చేసిన యశోదా ,కృష్ణ ఇవ్వడం ఎంతో కొత్తగా అనిపించింది.ఉత్తరీయం అని శాలువమరి ప్రశంసా పత్రం తో సత్కరించారు..ఇక్కడ నుండి మావోఇస్ట్ కల్లోల ప్రాంతంగా వార్తల్లో వినిపించే " లాల్ గఢ్"చాల దగ్గర.. ఈ యుద్ద వాతావరణం వల్ల ఇంకా చాల మంది కవులు హాజరు కాలేక పోయినట్టు చెప్పారు..ఆ సాయంత్రమే నేను 8.20 గంటలకు విప్లవ జి లోకల్ ట్రైన్ మిడ్నపోర్ లో ఎక్కించగా ఖరగ్పూర్ వచ్చి10.20 రాత్రి హౌరా-యశ్వంతపూర్ ఎక్ష్ప్రెస్స్ లో నెల్లూరు తిరుగు ప్రయాణం అయ్యాను..రవీంద్రుని గడ్డపై ఒకసాహిత్య కార్య క్రమం హాజరై ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుకున్నాను..గొప్ప ఆనందం కలిగింది..